Friday, March 29, 2024
- Advertisement -

వైయస్‌ భారతిని కలిసిన మహేష్ బాబు భార్య నమ్రత

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భార్య వైయస్‌ భారతిని స్టార్ హీరో మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ కలిశారు. సీఎం నివాసంలో భారతిని కలిసిన నమ్రత అరగంట పాటు పలు విషయాలపై చర్చించారు.

మహేశ్ బాబు ఏపీలో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో బుర్రిపాలెం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం అందేలా కృషి చేయాలని నమ్రతా శిరోద్కర్‌ వైయస్‌ భారతిని కోరినట్లు సమాచారం. పలు అంశాలపై చర్చించుకున్నాటు సమాచారం.

అయితే నమ్రతా శిరోద్కర్‌ అంతకు ముందు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. నమ్రతకు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని ఆలయ ఈవో అందజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -