Wednesday, April 24, 2024
- Advertisement -

సూర్యాపేట‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం…ఐదుగురు మృతి

- Advertisement -

సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.కోదాడ సమీపంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను లారీ ఢీకొట్ట‌డంతో ఆటోలో ఉన్న వారంద‌రూ స్పాట్‌లో చ‌నిపోయిన‌ట్లు స‌మాచారం.

తమ్మరలో శ్రీరామనవమి వేడుకలకు వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయ‌ప‌డిన వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -