Tuesday, April 23, 2024
- Advertisement -

టీవీ చూస్తోంద‌ని ఐదేళ్ల కూతురుని కొట్టి చంపిన త‌ల్లి..

- Advertisement -

చ‌వువులు ప‌క్క‌న పెట్టి టీవీల‌కు పిల్ల‌లు అతుక్కుపోతున్నారు. వారికి న‌చ్చ‌జెప్పాల్సిన త‌ల్లి దండ్రులు క్ష‌ణ‌కావేశంలో తీసుకుంటున్న నిర్ణ‌యాలు వారి కుటుంబాల్లో విషాద చాయ‌లు అలుముకొనేలా చేస్తున్నాయి. టీవీ ప‌దే చూస్తోంద‌ని ఓత‌ల్లి త‌న ఐదేళ్ల కూతురిని విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్ట‌డంతో పాటు ఎండలో నిలబెట్టింది. దెబ్బలు తాళలేక, ఎండ తీవ్రతకు చిన్నారి అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులోని తిరుచ్చి జిల్లాలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెల్తే….ఆమె ఓ ఉపాధ్యాయురాలు.. ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమె.. నిత్యం వందల మంది విద్యార్థులను సముదాయించాల్సి ఉంటుంది. కానీ, తన కూతురు విషయంలోనే తన కోపాన్ని ఆపుకోలేక‌పోయింది. చదవకుండా టీవీ చూస్తోందని కన్న కూతురిని ఆ తల్లి దారుణంగా కొట్టి చంపింది.

తిరుచ్చి కట్టుపుతూర్‌లోనిపల్లివసల్ వీధికి చెందిన పాండ్యన్-నిత్య కమలం దంపతులకు ఒక్కగానొక్క కూతురు లతికా శ్రీ. నిత్యకమల గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్‌. తన ఐదేళ్ల కుమార్తె లతికా శ్రీని చదువుకోవాలని కోరింది.. ఆ చిన్నారి అంతగా పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఉండిపోయింది. దీంతో కోపంతో ఊగిపోయిన నిత్య కమల.. చదవడంలేదని తన కూతురిని దారుణంగా కొట్టింది.చిన్నారి ఒళ్లంతా వాతలు తేలేలా బెల్టుతో తల్లి దారుణంగా కొట్టింది. తర్వాత ఎండలోకి వెళ్లి నిలబడాలని పనిష్మెంట్ ఇచ్చింది. అలా గంట‌ల త‌ర‌బ‌డి ఎండలో ఉండ‌టం వ‌ల్ల పాప కుప్ప‌కూలిపోయింది. వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెల్లినా లాభం లేక‌పోవ‌డంతో ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -