Thursday, April 25, 2024
- Advertisement -

ప్రియురాలికి బాటిల్ రక్తం గిఫ్ట్ గా పంపిన ప్రేమికుడు…..చివరకు ఏమయ్యిందంటే..?

- Advertisement -

తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన చెన్నై సమీపంలోని నంగనల్లూరులో చోటుచేసుకుంది .చేతి మణికట్టును కోసుకున్న యువకుడు మద్యం బాటిల్‌లో తన రక్తాన్ని సేకరించి ప్రియురాలికి చివరి బహుమతిగా ఇవ్వాలంటూ స్నేహితుడికి ఇచ్చాడు.

వివరాల్లోకి వెల్తే…నంగల్లూరుకు చెందిన కుమరేశ పాండి(25) కార్పెంటర్‌ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సమీప బంధువైన యువతితో స్నేహం కాస్త ప్రేమగా మారింది. కొద్దిరోజుల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత యువతి అతడితో మాట్లాడటం మానేసింది. ఎన్ని సార్లు ఫోన్లు చేసినా కట్ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీంతో మద్యానికి బానిసయ్యాడు.

మంగళవారం రాత్రి పాండియన్ తన ఫ్రెండ్ ముత్తుతో కలిసి పల్లవరంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో మద్యం తాగాడు. మద్యం మత్తులో ప్రియురాలిని తలుచుకుంటూ బాటిల్ పగులగొట్టి తన చేతిని కోసుకున్నాడు. ధారలా కారుతున్న తన రక్తాన్ని బాటిల్‌లో పట్టి తన ప్రియురాలికి చివరి బహుమతిగా ఇవ్వాలని ఫ్రెండ్‌కు చెప్పాడు.

రక్తం ఎక్కువగా పోవడంతో పాండ్యన్ అపస్మారక స్థితిలోకి వెల్లి పోయారు. ముత్తు ఇరుగు పోరుగు వారి సాయంతో అతడిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ మెలకువ వచ్చిన పాండియన్ తనకు చికిత్స చేయొద్దని డాక్టర్లతో వాగ్వాదానికి దిగాడు. డాక్టర్లు ఎంత ప్రయత్నించిగా చికిత్స అందించడం సాధ్యం కాకపోవడంతో బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న శంకర్ నగర్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -