- Advertisement -
తెలుగు దేశం సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారిపై కేసు నమోదయ్యింది.తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిన్న ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమంలో నన్నపనేని రాజకుమారి, స్థానిక ఎస్సై అనురాధ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఈ దళఙతుల వల్లే మాకీ దరిద్రం’ అంటూ నన్నపనేని దూషించిన విషయం తెలిసిందే.
నన్నపనేని తనను కులం పేరుతో దూషించారనీ, ‘ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం’ అని వ్యాఖ్యానించినట్లు ఎస్సై ఆరోపించారు. తాజాగా ఈ వ్యవహారంలో ఎస్సై ఫిర్యాదుతో నన్నపనేని రాజకుమారిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 303, 506,509 r/w 34 కింద పోలీసులు కేసు నమోదుచేశారు.