Tuesday, April 23, 2024
- Advertisement -

అత్యంత విషమంగా చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్యం…

- Advertisement -

టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోత్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

శివప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు బంధువుల ద్వారా తెలుస్తోంది. నారమల్లి శివప్రసాద్ రెండుసార్లు చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. 2009, 2014లో ఆయన చిత్తూరు ఎంపీగా ఉన్నారు.

స్వతహాగా శివప్రసారద్ నటుడు కావడంతో వెరైటీ వేషలతో నిరసన తెలపడం ఆయనకే దక్కుతుంది. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసనలె తెలిపి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -