టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.పరిస్థితి విషయమించడంతో ఆయన శనివారం కన్నుమూశారు.
నారమల్లి శివప్రసాద్ రెండుసార్లు చిత్తూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. 2009, 2014లో ఆయన చిత్తూరు ఎంపీగా ఉన్నారు.
స్వతహాగా శివప్రసారద్ నటుడు కావడంతో వెరైటీ వేషలతో నిరసన తెలపడం ఆయనకే దక్కుతుంది. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసనలె తెలిపి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం అపోలో ఆస్పత్రిలో శివప్రసాద్ను పరామర్శించారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు కూడా శివప్రసాద్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన పలు చిత్రాల్లో నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించారు