Thursday, April 25, 2024
- Advertisement -

వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ దాడి..ప‌లువురికి గాయాలు

- Advertisement -

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు. కోటబొమ్మాళి మండల వైఎస్సార్ సీపీ కార్యాలయంపై గురువారం ఉదయం టీడీపీ నేత బోయిన రమేష్‌ ఆధ్వర్యంలో దాడి చేశారు. కార్యాల‌యంలో ఉన్న ఫ‌ర్నీర్స్‌ఖ, కొన్ని ఫైల్స్‌ను ధ్వంసంచేసిన ప‌చ్చ‌పార్టీ కార్య‌క‌ర్త‌లు అక్క‌డే ఉన్న వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై కర్రలు, ఐరన్‌ రాడ్లుతో విచ‌క్ష‌ణా ర‌హితంగాదాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని టెక్క‌లి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.ఈ దాడిలో సుమారు 120మంది పాల్గొన్నట్లు వైసీపి కార్యకర్తలు చెప్పుకొచ్చారు. పోలీస్ స్టేష‌న్‌కు కూత వేటు దూరంలోనె ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది, అయితే పోలీసులు ఎలాంటి కేసులు న‌మోదు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -