- Advertisement -
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో కొనసాగిన వైసీపీ రౌండ్ రౌండ్కూ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతోంది.తమకు 120 నుంచి 130 సీట్లు వస్తాయని ముందునుంచి వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండగా, ప్రస్తుత ట్రెండ్స్ కనీసం 150 సీట్లలో వైసీపీ ఆధిపత్యాన్ని చూపుతున్నాయి.
ముందు నుంచి మంత్రులందరికి ఓటమి తప్పదని వెలువడిన సంకేతాలు నిజమయ్యాయి. ఫ్యాన్ జోరుకు పలువురు మంత్రులు కొట్టుకుపోయారు. నారా లోకేశ్, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, నారాయణ, నక్కా ఆనందబాబు, అచ్చెన్నాయుడు, అఖిలప్రియ, కిడారి శ్రావణ్, తమ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల చేతిలో వెనుకంజలో కొనసాగుతున్నారు.