- Advertisement -
గత కొన్ని రోజులుగా బాబుకు నిద్రలేకుండా చేస్తున్న జమ్మలమడుగు పంచాయితీ ఒకొలిక్కి వచ్చింది. మంత్రి ఆది, రామసుబ్బారెడ్డిల మధ్య ఉన్న విబేధాలకు బాబు పుల్స్టాప్ పెట్టారు. సీఎం సమక్షంలో ఆది, రామసుబ్బారెడ్డి మధ్య రాజీ కుదిరింది. రామసుబ్బారెడ్డ ఎమ్మెల్సీ పదవిని ఆది సోదరుడు నారాయణరెడ్డికి ఇచ్చే విధంగాకి …జమ్మల మడుగు టికెట్ను రామసుబ్బారెడ్డికి ఇచ్చే విధంగా బాబు ఇద్దరినీ రాజీ చేయించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎంకు అందించార . కడప పార్లమెంట్ టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసేందుకు మంత్రి ఆదినారాయణ రెడ్డి అంగీకరించారు. దీంతో జమ్మలమడుగు పంచాయితీకి శభం కార్డు పడింది.