టీడీపీలో చంద్రబాబు నాయుడు కులాల వారిగీ ఓటీమ్ ఉంటుంది. ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడితే అదే కులం వారితో తిట్టించడంలో బాబు సిద్దహస్తుడు. అవసరానికి నేతలను ఉపయోగించుకొని అవసరం తీరాకా వారిని నట్టేట్లో ముంచడం బాబు స్ట్రాటజీ. టీడీపీకీ ఉన్న సినీ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా బాబుకు చుక్కలు చూపించడంలో ఏమాత్రం వెనక్కు తగ్గదు. జగన్నుగాని, వైసీపీనీ గాని అధికారపార్టీ నేతలు విమర్శలు చేస్తె వెంటనే ఆవిమర్శలను తిప్పికొట్టడంలో రోజా ముందుంటుంది. సినీ గ్లామర్ ఉన్న అలాంటి రోజాను ఎదుర్కోవాలంటే బాబుకు తలకుమించని పని. అందుకే దవ్యవాణిని రంగంలోకి దింపారు బాబు. ఎన్నికలు సమయంలో రోజాపై చిందులేస్తున్నారు టీడీపీనేత , సినీనటి దివ్వవాణి. బాబు ఆదేశాలతో రెచ్చిపోతున్నారు.
తాజాగా ఓఇంటర్వూలో జగన్, రోజాపై తీవ్ర మైన విమర్శలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ని రావణాసురుడిగా, ఆ పార్టీ నేత రోజాను శూర్పణఖగా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పథకాలపై బురదజల్లే కార్యక్రమానికి ఓ రావణాసురుడు, శూర్పణఖ పాల్పడుతున్నారంటూ జగన్, రోజాలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
గతంలో టీడీపీలో చేరిన దివ్వవాణి ఢిల్లీలో చంద్రబాబు నిర్వహించిన ధర్మపోరాట దీక్ష వేదికపై పెద్ద కామెడీనే చేశారు. ఆమె ఆవేశంతో ఊగిపోతూ, ప్రధాని నరేంద్రమోడీ మీద తీవ్ర మైన విమర్శలు చేశారు. తమ కుటుంబంలోని సొంత బాబాయ్ ప్రాణాలనే కాపాడుకోలేని వ్యక్తి, ఐదు కోట్ల ప్రజలను ఆయన కాపాడతారంటూ మండిపడ్డారు.
నగిరి నియోజకవర్గంలో రోజాని ఓడించేందుకోసం గతంలో వాణి విశ్వనాథ్ని తెరపైకి తేవాలనుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అప్పట్లో వాణి విశ్వనాథ్ తెగ హడావిడి చేసింది. తర్వాత వాణివిశ్వనాధ్ అడ్రస్ లేకుండా పోయారు. చంద్రబాబు మెప్పుకోసం వైసీపీ మీద విమర్శలు చేసేస్తున్నారు గానీ, చంద్రబాబు సంగతి ముందు ముందు ఆమెకు ఎలాగూ బాగానే అర్థమయిపోతుంది. సినీ గ్లామర్ని వాడుకుని వదిలేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. త్వరలో వాణి విశ్వనాధ్ సరసన దివ్వవాణి చేరినా ఆశ్చర్య పోవాల్సిన అవసరంలేదు.