తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం దాలిపాడులో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడి బుద్ది గాడి తప్పింది. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి సహజీవనం చేశాడు. తీరా బాలిక ఇంట్లో ఈ విషయం తెలియడంతో… వారి ఇద్దరికీ వివాహం చేశారు.
వివరాల్లోకి వెల్తే…తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలంలోనిస్థా నిక గిరిజన బాలికోన్నత ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికను ఆ పాఠశాలలో పని చేస్తున్న బెలెం చినబ్బాయి అనే ఉపాధ్యాయుడు రహస్య వివాహం చేసుకున్నాడు.అతనికి గతంలోనే వివాహం జరగగా… అది ఎవరికీ చెప్పకుండా పాఠశాలలో చదివే బాలికతో ప్రేమాయణం నడిపాడు. సదరు విద్యార్థినిని మాయమాటలతో లోబరుచుకున్న చినబ్బాయి… ఏడాది కాలంగా ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో దీంతో చినబ్బాయిని వారు నిలదీశారు. అంతేకాదు, గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, పెద్దల సమక్షంలో బాలికను చినబ్బాయి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.