- Advertisement -
కేసీఆర్ సర్కార్ దూకుడుకు హైకోర్టు బ్రేకులు వేసింది.పాత సచివాలయాన్ని కూల్చివేసి.. కొత్త భవనాలను నిర్మించాలని భావిస్తోన్న ప్రభుత్వం.. ఇప్పటికే సచివాలయాన్ని తరలించింది. మంత్రుల కార్యాలయాల తరలింపు ప్రక్రియ కూడా నడుస్తోంది.ఇదలా ఉంటే పాత సచివాలయ భవనాలను కూల్చివేయవద్దని హైకోర్టు స్టే విధించింది.ఇక, ఈ వ్యవమారంపై దసరా సెలవుల తర్వాత విచారణ జరుపుతామని వెల్లడించిన కోర్టు.. తదుపరి విచారణ అక్టోబరు 14కు వాయిదా వేసింది.
కొత్త సచివాలయ భవన సముదాయనిర్మాణంపై కేసీఆర్ మంత్ర వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉపసంఘం ఇచ్చే నివేదికను ఇవాలా జరిగే తెలంగాణ కేబినెట్ ఆమోదించనున్న నేపథ్యంలో హైకోర్టు స్టే విధించడంతో పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లుంది.