నెల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ ఆనందంగా జరపుకోవాల్సిన ముగ్గురు స్వేహితులను మృత్యువు కబలించింది. దీంతో పండగ పూట వారి కుటంబాల్లో విషాయ చాయలు అలుముకున్నారు. ఇలా ముగ్గురు కలిసి సరదాగా గడపడానికి మోటార్ సైకిల్పై వెళుతుండగా లారీ ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు.
నెల్లూరు జిల్లా జంగాలదొరువు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నార్త్రాజుపాళెం గ్రామానికి చెందిన నన్నెసాహెబ్, ఊచగుంటపాళెంకు చెందిన రాములు ప్రాణ స్నేహితులు. సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గురు స్నేహితులు కుటుంబాలతో కలిసి స్వగ్రామాలకు వచ్చారు.. ఈ సందర్భంగా వీరు కలుసుకుని సరదాగా పడపాలనున్నారు. ఇందుకోసం ముగ్గరూ ఒకే బైక్ పై సమీపంలోని నెల్లూరు పట్టణానికి బయలుదేరారు. మార్గమధ్యలో ముంబై రహదారిపై ప్రయాణిస్తున్న వీరి వాహనాన్ని ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో వున్నట్లు తెలిపారు. పండగ పూట తమ వారిని కోల్పోయిన కుటంబ సభ్యుల రోదనలతో సంఘటనా స్థలం మిన్నంటింది.