Wednesday, April 24, 2024
- Advertisement -

భారత్ లో ఎక్కువవుతున్న కరోనా.. ఒక్కరోజులో ముగ్గురి మృతి..!

- Advertisement -

చైనా నుంచి ప్రపంచ దేశాలపై తన పంజా విసురుతున్న కరోనా వైరస్ భారత్ లోనూ ప్రమాదంగా మారుతోంది. ఈ ఒక్క రోజులోనే ముగ్గురు మృతి చెందడం జరిగింది.

ఈ మహమ్మారి మరెంత మందిని తీసుకెళ్తుందో అని ప్రజలు భయపడుతున్నారు. తాజా మరణాలతో భారత్ లో ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఏడుకి చేరింది. బీహార్ కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి కూడా మృతుల్లో ఉన్నాడు. ఇప్పటివరకు దేశంలో కరోనాతో చనిపోయిన వారిలో ఈ బీహార్ వ్యక్తి తక్కువ వయసు గలవాడు.

అతడు పాట్నాలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇవాళ మరణించిన మిగతా ఇద్దరిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు గుజరాత్ కు చెందిన వ్యక్తి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -