- Advertisement -
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన రోడ్డు షోలో అపశృతి చోటుచేసుకుంది. సభ ముగిశాక భవనం పై నుంచి దిగుతుండగా ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. విద్యుత్ వైర్లు తగిలి నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో సోమిరెడ్డి ఆర్టీసీ కండక్టర్ మృతిచెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పిడుగురాళ్లలోని ఐలాండ్ సెంటర్ లో బహిరంగ సభ నిర్వహించారు జగన్. దీనికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. జగన్ ప్రసంగం ముగించి వెళ్లగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న జ్యూస్ షాపు జనరైటర్ వైర్ కట్ చేసి వదిలివెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈఘటనపై అనుమానాలు తలెత్తడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు పోలీసులు.