Friday, March 29, 2024
- Advertisement -

పేద పిల్లలకు ట్రూజెట్‌ ఉచిత ప్రయాణం

- Advertisement -

బాలల దినోత్సవం, నెహ్రూ జయంతి సందర్భంగా విమాన ప్రయాణం చేయగల ఆర్థిక స్థోమత లేని చిన్నారులకు ట్రూజెట్‌ ఉచితంగా విమాన సౌకర్యం కల్పించింది. చిన్నారుల ఆశలు, కలలను పండించే విధంగా వారిని చెన్నై- సేలం మధ్య ఉచితంగా బుధవారం ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళింది. మొత్తం నలభైమంది చిన్నారులు ఈ ప్రయాణం ద్వారా సరికొత్తఅనుభూతితో ఉప్పోంగిపోయారు.

చిన్న వయసులోనే తమకు విమానంలో ప్రయాణించే అవకాశం కలిగినందుకు వారిలో ఆనందం, సంతోషానికి అవధులు లేకుండాపోయింది. తమిళనాడులోని ఎస్‌ఆర్‌వివి పాఠశాలకుసంబంధించిన 40 మంది చిన్నారులను వెల్లప్ప సెంబనా గౌండర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ సమీకరించి ట్రూజెట్‌ ద్వారా ఉచితంగా ప్రయాణించే ఏర్పాటు చేసింది.

ఉదయం 10.30 గంటలకు వారిని ట్రూజెట్‌ కమర్షియల్‌ సర్వీసులో తీసుకువెళ్లే కార్యక్రమంలో చిన్నారులకు విమాన సిబ్బంది ఆత్మీయంగా, అప్యాయంగా స్వాగతం పలికారు. ట్రూజెట్‌ తనవాణిజ్య కార్యక్రమాల్లో భాగంగా 300 మంది చిన్నారులను దశలవారిగా ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంలో భాగంగా నెహ్రూ జయంతి రోజున ఈ కార్యక్రమంనిర్వహించారు. సేలంకు చెందిన వారందరూ చెన్నైకి విద్యా, విజ్ఞాన యాత్రకు వచ్చారు. అక్కడి నుంచి వారిని తిరుగు ప్రయాణంలో ట్రూజెట్‌ ఉచితంగా తీసుకెళ్ళింది.
ఇంతకు ముందు వాల్మీకి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి బళ్ళారికి ఇదేవిధంగా 40మంది పేద విద్యార్థులను తీసుకెళ్ళింది. ఇటీవల ప్రకృతి వైపరీత్యంతో విలవిల్లాడిన కేరళలోవరద బాధితులను ఆదుకునేందుకు ట్రూజెట్‌ ప్రత్యేకంగా ఉచిత విమాన సర్వీసులను నిర్వహించింది. చెన్నై నుంచి బాధితులకు వస్తు సామాగ్రి తీసుకెళ్ళడంతో పాటు తిరుగు ప్రయాణంలోతిరువనంతపురం వరదల్లో చిక్కుకున్న వారిని చెన్నైకు తీసుకెళ్ళింది. ఆ విధంగా మూడు రోజుల పాటు షెడ్యూల్‌ నిర్వహించిన సంగతి తెలిసింది.

ప్రస్తుతం ట్రూజెట్‌ సంస్థ ఐదు విమానాల ద్వారా ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తీసుకెళుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్‌ పథకం తోలి దశలో 18 రూట్లనుపొందిన ట్రూజెట్‌ ఆయా ప్రాంతాలకు ఇప్పటికే విమాన సర్వీసెస్‌ను ప్రారంభించింది. సర్వీసెస్‌ ప్రారంభించిన నగరాల్లో హైదరాబాద్‌ నుంచి ముంబై, ఔరంగాబాద్‌, చెన్నై, గోవా, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, కడప, రాజమండ్రి, మైసూర్‌, విద్యానగర్‌ ఉన్నాయి.
హైదరాబాద్‌- ఔరంగాబాద్‌ మధ్య విమాన సర్వీస్‌ నడుపుతున్న సంస్థ ట్రూజెట్‌ ఒక్కటే. దక్షిణాదిలో హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరులకు తొలుత సర్వీసుప్రారంభించిన ట్రూజెట్‌ అనతికాలంలోనే ఔరంగబాద్‌, చెన్నై, కడప, గోవా, ముంబయి, నందేడ్‌, బళ్లారి, మైసూర్‌ ప్రాంతాలకు విమాన సర్వీసులను విస్తరించింది. ట్రూజెట్‌ ప్రయాణికులకుఅధునాతన ఎంటర్‌టైన్‌మెంట్‌ సౌకర్యాలను అందజేస్తోంది. స్నేహితులు, కుటుంబసభ్యులు గ్రూప్‌బుకింగ్స్‌ చేసుకుంటే వారికి వివిధ ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తోంది.
అదే విధంగా ట్రూజెట్‌ ప్లాన్‌ ‘బి’ క్రింద మధ్య, చిన్నతరహా ఎంటర్‌ప్రైజులకు ప్రత్యేక సదుపాయాలను అందిస్తోంది. అలాగే కార్పోరేట్‌ రంగంలోని వారికి తరచూ ప్రయాణించే వారికి ఫ్లాట్‌ రేటువిధానం క్రింద ప్రయాణికులకు అనుకూలమైన చార్జీలను వసూలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే కాన్సిలేషన్‌ ఫీజు కూడా అతి తక్కువగా ఉంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -