Friday, April 26, 2024
- Advertisement -

అమెరికాలో .. 2.40 లక్షల మంది వరకూ చనిపోవచ్చట..!

- Advertisement -

అమెరికాలో ఇప్పటికే దారుణమైన పరిస్థితి ఉంది. అయితే రానున్న రెండు వారాల్లో అమెరికన్లకు అత్యంత బాధాకరమైన రోజులు కాబోతున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. దాదాపుగా 2.40 లక్షల మంది వరకూ అమెరికన్లు చనిపోవచ్చని వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ అంచనా వేసింది.

ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ” రెండు వారాల్లో ఎవరు ఊహించని.. చాలా బాధను కలిగించే సంఘటనలు జరుగుతాయి” అని వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. కరోనా వైరస్ ప్లేగు వ్యాధిని గుర్తు చేస్తోందన్నారు ట్రంప్. ముందు ముందు రానున్న కష్టాలను ఎదుర్కునేందుకు అమెరికన్లు సిద్దంగా ఉండాలని సూచించారు. ఇక అమెరికాలోని టాప్ హెల్త్ ఎక్స్ పర్ట్స్ మాత్రం.. ఈ కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే.. వైరస్ సోకకుండా ఉండాలంటే.. ప్రజలు భౌతిక దూరాన్ని పాటించడం, ఎవరూ గుమికూడ ఉండటం చేయాలని సలహా ఇస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే అమెరికా ఆర్దిక వ్యవస్థ దెబ్బ తిన్నది.

“కరోనాను శరీరం నుంచి తొలిగించేందుకు ఏ మ్యాజిక్ వాక్సిన్ లేదా వైద్యం లేదు. కేవలం అలవాట్లను మార్చుకోవడం ద్వారా వైరస్ కు దూరం కావచ్చు” అని వైట్ హౌస్ కరోనా వైరస్ రెస్పాన్సివ్ టీమ్ సమన్వయకర్త డెబోరాహ్ బిర్క్స్ వ్యాఖ్యానించారు. అమెరికాలో కరోనా మరణాలు ఎలా ఉంటాయన్న అంచనాను తెలిపే ఓ చార్టును ప్రదర్శించిన ఆయన, యూఎస్ లో లక్ష నుంచి 2.40 లక్షల వరకూ మరణాలు సంభవించవచ్చని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -