Friday, April 19, 2024
- Advertisement -

డ్రగ్స్ కేసుకు తాప్సి కి సంబంధం ఏంటి..?

- Advertisement -

ప్రస్తుతం దేశంలో మారుమోగిపోతున్న టాపిక్ డ్రగ్స్ కేసు.. సుశాంత్ మరనంలోని కోణాలను వెలికి తీస్తూ డ్రగ్స్ వరకు పోలీసులు పయనం మొదలుపెట్టారు.. సుశాంత్ ప్రియురాలు ఈ డ్రగ్స్ కేసు లో ప్రధాన నిందితురాలు కాగ ఆమె తో పాటు మరి కొంతమంది పేర్లు ఇప్పుడు బయటకి రావడం చర్చనీయంశామైంది.. ఇప్పటికే రాకుల్ ప్రీత్ సింగ్ ఈ ఆరోపణలు ఎదుర్కుంటుంది..

ఈ నేపథ్యంలో, టాలీవుడ్ నటి తాప్సీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి తరచూ వివాదాస్పదంగా మాట్లాడితే కొన్ని రోజుల తర్వాత వారి వ్యాఖ్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని వ్యాఖ్యానించింది. ఇదే మాదిరి కంగనా రనౌత్ మాటలు కూడా తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేవని చెప్పింది.

రియా చక్రవర్తి గురించి మాట్లాడుతూ… రియా ఎవరో తనకు తెలియదని తాప్సీ తెలిపింది. రియాతో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పింది. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసులో రియాను టార్గెట్ చేయడం, ఆమె పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధగా ఉందని తెలిపింది. బాలీవుడ్ సెలెబ్రిటీల్లో చాలా మంది ఏదో ఒక సమయంలో తప్పు చేశారని… అయితే, వారెవరినీ రియాను చూసినంత దారుణంగా చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -