Friday, April 19, 2024
- Advertisement -

భార్య క‌ల్లెదుటే సెల్ఫీ తీసుకుంటూ భ‌ర్త‌, ఇద్ద‌రు చెల్లెల్లు రిజ‌ర్వాయ‌ర్‌లో గ‌ల్లంతు

- Advertisement -

ఈ మ‌ధ్య‌న ఎక్కువ‌గా సెల్ఫీ పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. క్రేజ్ కోసం ప్ర‌మాద‌క‌ర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకుంటూ విలువైన ప్రాణాల‌ను పొగొట్టుకుంటున్నారు. తాజాగా జ‌న‌గామ ఇలాంటి సంఘ‌ట‌నే జిల్లాలోని నర్మెట్ట మండలం బొమ్మకూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. భార్య క‌ల్లెదుటే సెల్ఫీ పిచ్చితో ముగ్గురు రిజ‌ర్వాయ‌ర్లో మునిగి ప్రాణాలు పొగొట్టుకున్నారు.

రిజర్వాయర్‌ను చూసేందుకు వచ్చిన ఓ యువకుడు, ఇద్దరు యువతులు సెల్పీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయి గ‌ల్లంత‌య్యారు. గల్లంతైన వారు అవినాశ్ (32) సంగీత(19), సుమలత(18) వారి స్వస్థలం రఘునాథ్‌పల్లి మండలంలోని మేకలగుట్ట గ్రామ పరిధిలోని బండతండ వాసులుగా గుర్తించారు.

ఇద్దరు మరదళ్లతో కలిసి చెరువులోకి దిగిన అవినాష్‌.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఈ దృశ్యానంతా అవినాష్‌ భార్య ఫోన్‌లో రికార్డు చేస్తునే ఉన్నారు. అప్పటి వరకు నీళ్లలో అడిన ముగ్గరు ఒక్కసారిగా చెరులో గల్లంతయ్యారు. దీంతో ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో ఒకరి మృతదేహాన్ని వెలికి బయటికి తీశారు. మరో ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -