- Advertisement -
నల్గొండ జిల్లాలో దారుణమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇక్కడి కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద జాతీయ రహదారిపై వెళుతున్న ట్యాంకర్ ను ఓ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఇధ్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 15 మందికి గాయాలు అయ్యాయి. క్షత గాత్రులను నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి హైదరాబాద్కు బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.