కరకట్టమీద అక్రమంగా కట్టిన లింగమనేని గెస్ట్ హౌస్ లో ఉంటున్న మాజీ సీఎం చంద్రబాబు ఖాలీ చేయకుండా మొండికేస్తున్నారు. ప్రభుత్వం, సీఆర్ డీఏ గతంలో ఎన్నిసార్లు నోటీసులు అంటించిన బాబు బేఖాతర్ చేశారు. వరద ముంపు నేపథ్యంలో బాబు ఉంటున్న ఇంటిని చుట్టుముట్టింది వరద. దీంతో మరో సారి బాబు ఇంటికెల్లారు ఉండవల్లి వీఆర్వో వెళ్లారు.
కృష్ణానదికి లక్షలాది క్యూసెక్కుల వరదనీరు పోటెత్తుతుండటంతో… విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దిగువన ఉన్న పలు గ్రామాలు నీట మునగడమే కాక, వాటికి రాకపోకలు కూడా స్తంభించాయి. దీంతో వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చేందుకు ఉండవల్లి వీఆర్వో బాబు ఇంటికి వెల్లారు.
నోటీసులను తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతోపాటు…సెక్యూరిటీ కూడా అనుమతించలేదు. దీంతో చేసేదేమిలేక వీఆర్వో బాబు ఇంటి గోడకు నోటీసులు అంటించి వెల్లారు. బాబు ఇంటితో పాటు అక్రమకట్టడాన్నింటికి నోటీసలు అందించారు.