పశ్చిమ గోదావరి జిల్లాలో జ్యోతి హత్యోదంతం లాంటి ఘటన జరగకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. గోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ప్రేమజంటపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో యువతి చనిపోగా.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన నవీన్ను పోలీసులు విచారిస్తున్నారు.
గుంటుపల్లి బౌద్దారామం సందర్శనకు వచ్చిన జంటపై దాడికి పాల్పడ్డారని స్థానికుల సమాచారం. బాధితుడు భీమడోలు మం. అజ్జావారిగూడేనికి చెందిన నవీన్గా గుర్తించారు. యువతి వివరాలు తెలియాల్సి ఉంది. జ్యోతి ఉదంతం నేపధ్యంలో
పోలీసులు కేసును లోతుగా విచారిస్తున్నారు. గాయాలతో బయటపడిని యువకుడు నవీన్ను పోలీసులు విచారిస్తున్నారు. నవీన్ చెప్తున్న మాటలకు పొంతన లేకుండా ఉండటంతో నవీన్పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలసులు వెల్లే సరికి అమ్మాయి వివస్త్రగా పడి ఉండటంతో యువతిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టిన పోలీసులు.