గుజరాత్ ఎన్నికల ప్రచారంలో హార్ధిక్ పటేల్కు చేదు అనుభదం ఎదురయ్యింది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో మాట్లాడుతుండగా వేదికపైకి దూసుకొచ్చి ఓ వ్యక్తి చెంపై కొట్టడంతో అక్కడ గందరగోలం నెలకొంది. దాడి చేసిన వ్యక్తిని అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు సదరు వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సురేందర్ నగర్ లో జరిగింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధిని మోదీపై విమర్శులు చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అయితే కొట్టిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సిఉంది. ఈ మధ్యన నాయకులపైఇలా బైతిక దాడులు చేయడం సర్వసాధారనంగా మారింది.
మొన్న ఏపీ ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల్ శివప్రసాద్ పై దాడులు చేయగా, తాజాగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై చెప్పు దాడి జరిగింది. దీంతో నేతలకు అదనపు భధ్రత కల్పించాలనే డిమాండ్ వెలుగులోకి వస్తోంది.