- Advertisement -
ఉత్తర ప్రదేశ్లో ఘోరం చోటు చేసుకుంది. భర్త నల్లగా ఉన్నాడని భార్య పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బరేలిలో నివసిస్తున్న ప్రేమ్శ్రీ, సత్యవీర్సింగ్కు రెండేళ్ల కిత్రమం పెళ్లైంది. వీరిద్దరికి సంతానంగా 5 నెలల పాప ఉంది. చూడటానికి అందంగా ఉండే ప్రేమ్ శ్రీ తన భర్త సత్యవీర్ సింగ్ నల్లగా ఉన్నాడని బాధపడేది.
తన భర్త నల్లగుండటం తట్టుకోలేక.. నిద్రిస్తున్న సమయంలో అతనిపై పెట్రోల్ పోసి తగులబెట్టింది. దీంతో తీవ్రగాయాలైన సత్యవీర్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి సోదరుడు హర్వీర్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.