మహాభారతంలో పాండవులు ద్రౌపతిని జూదంలో పందెం కాస్తె….తాజాగా తాగుడు, జూదంలకు బానిస అయిన ఓ ప్రబుద్ధుడు భార్యను పందెం కాశాడు. బెట్టింగ్లో ఓడటంతో.. తన స్నేహితులకు భార్యను అప్పగించాడు. దీంతో వారు ఆమెపై రెండు సార్లు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. తన భర్త మద్యానికి బానిసై డబ్బు లేకపోవడంతో చివరికి పందెంగా తనను ముందుకుతెచ్చాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెల్తే…ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్ ఈ సంఘటన జరిగింది. జూదంలో ఓడిపోవడంతో భార్యను స్నేహితులకు భార్యను అప్పగించాడు. వారు భార్యపైగ్యాంగ్ రేప్ చేశారు. భర్తే ఇలా చేయడంతో ఆమె బాధతో మేనమామ ఇంటికెళ్లింది. తన వెనకే వచ్చిన భర్త మన్నించమని వేడుకోవడంతో మనసు మార్చుకొని వచ్చింది.
మార్గమధ్యంలో కారును నిలిపివేసిన నిందితుడు తన స్నేహితులను మరోసారి ఆమెపై లైంగిక దాడి చేసేందుకు సహకరించాడు. జఫరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోక పోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆదేశాలతో.. జఫారాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాగుడుకు బానిసైన తన భర్త జూదం కోసం డబ్బులు లేకపోవడంతో తనను పందెంగా పెట్టాడని బాధితురాలు వాపోయింది. భర్త స్నేహితుడైన అరుణ్, అతడి బంధువు అనిల్ తరచుగా తమ ఇంటికొచ్చి మందు తాగుతూ జూదం ఆడతారని చెప్పింది. ఒక రోజు తన భర్త పందెం కాశాడని.. ఓడటంతో.. అరుణ్, అనిల్ కలిసి తనను గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపించింది.