Wednesday, April 24, 2024
- Advertisement -

పోలీసుల‌ను చిత‌క‌బాదిన‌ హిజ్రాలు …

- Advertisement -

హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ రింగ్ రోడ్డు వ‌ద్ద ఆర్ధ‌రాత్రి హిజ్రాలు ర‌చ్చ ర‌చ్చ చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా వాహనదారులు – ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం (ఫిబ్రవరి 13) అర్ధరాత్రి కొంత మంది హిజ్రాలు ఉప్పల్ రింగ్ రోడ్డు సమీపంలోని బస్‌స్టాప్‌లో పలు కార్లను అడ్డగించి పలువురిపై దాడి చేశారు. వాల్ల‌ద‌గ్గ‌రున్న వాలెట్‌లు, బంగారు గొలుసులు, ఫోన‌ల్‌ను బ‌ల‌వంత‌గా లాక్కోవ‌డంతోపాటు ప‌లు వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. అడ్డు వ‌చ్చిన వారిపై దాడి చేశారు.

భయంతో సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు బాధితులు పరుగులు తీశారు. అంతటితో ఆగుకుండా పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లి వీరంగం సృష్టించారు. అడ్డు వచ్చిన ముగ్గురు పోలీసులను కూడా వదల్లేదు. వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్టేషన్ ప్రాంగణంలోని పూలకుండీలను ధ్వంసం చేశారు. అదే స‌మ‌యానికి స్టేష‌న్‌కు వ‌చ్చిన ఏసీపీ గాంధీ నారాయణపైకి కూడా దూసుకెళ్లి దాడికి యత్నించారు. మితిమీరి ప్రవర్తించడంతో పాటు కోపంతో ఊగిపోయారు. బండ‌బూతులు తిడుతూ వీరంగం వేశారు.

స్టేషన్ కు వచ్చిన సీఐ.. బాధితులు – గాయపడిన కానిస్టేబుళ్ల నుంచి ఫిర్యాదు తీసుకుని వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రికి బయలుదేరిన బాధితులను కూడా కొంత దూరం వెంబడించారు. తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ దమనకాండ కొనసాగింది. పోలీసులు ఎక్కువ‌గా లేక‌పోవ‌డం…చాలా మంది హిజ్రాలు ఉండ‌టంతో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దాడి ఘ‌ట‌న‌లోప్రదీప్‌ రెడ్డి, రాంరెడ్డి గాయపడ్డారు. ప్రదీప్‌ రెడ్డికి చెందిన కారును పూర్తిగా ధ్వంసం చేశారు. రాంరెడ్డికి చెందిన మొబైల్ ఫోన్, బంగారు గొలుసు, పర్సును హిజ్రాలు లాక్కున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -