Thursday, April 25, 2024
- Advertisement -

ఆ రాక్షసులను ఉరి తీయండి

- Advertisement -

ప్రియాంక రెడ్డి దారుణ హత్యోదంతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పక్కా ప్లాన్ తో నలుగురు మృగాళ్లు సాగించిన రాక్షస కాండపై దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళన వ్యక్తం అయింది. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ముక్తకంఠంతో ప్రియాంక రెడ్డి హత్యను ఖండించారు.

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల గాంధీతో పాటు బాలీవు‌డ్, టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు. మృగాల కంటే హీనంగా ప్రవర్తించిన హంతకులను అత్యంత కఠినంగా శిక్షించాలని నినదించారు.

మృగాళ్ల చేతుల్లో ప్రియాంక అనువించిన క్షోభను తలచుకుంటే కన్నీరు ఆగడం లేదని, ఈ కిరాతకాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదని అనుష్క, రకుల్ ప్రీత్, కాజల్, కీర్తి సురేష్, రాశిఖన్నా, లావణ్యత్రిపాఠి సహా చాలా మంది హీరోయిన్లు వ్యాఖ్యానించారు. ప్రియాంక రెడ్డి ఘటన గురించి తెలిశాక తమ గుండె పగిలిందని, స్పందించడానికి మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు మహిళలు సురక్షితంగా ఉండగలిగే చోటు ఎక్కడైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి నేరం చేయాలనే ఆలోచనే రాకుండా హంతకులను శిక్షించాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఆ రాక్షసులను ఉరి తీయాలని ముక్తకంఠంతో కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -