వైసీపీ లో కీలక పాత్ర పోషిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ఏపీ ఇన్ఛార్జ్గా గతంలో విజయసాయిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ నియామకాన్ని రద్దు చేసింది. ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ 68ని రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు కారణం ఎంపీగా లాభదాయకమైన పదవిలో ఉన్నందును ఆమర రియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది.
త్వరలోనె ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కొత్త వారిని నియమించనున్నారు. విజయసాయి నియామకాన్ని రద్దు చేయడంతో రాష్ట్రంలో కేబినేట్ హోదా దక్కకుండా పోయింది. పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించే విజయసాయిరెడ్డికి రాష్ట్రంలోనూ కేబినెట్ మంత్రి హోదా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయనకు ఈ పదవి కేటాయించినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి.