Thursday, March 28, 2024
- Advertisement -

విలేజ్ వాలెంటీర్ల వ్యవస్థతో పాలనలో పారదర్శకతకు శ్రీకారం

- Advertisement -

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్ మోహన్ రెడ్డి యువతకు గ్రామ వాలెంటీర్ల ఉద్యోగాలు ప్రకటించారు. పాదయాత్రలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేసింది. విలేజ్ వాలంటీర్లను నామినేట్ చేస్తే అవినీతి జరుగుతుందని భావించిన జగన్ మోహన్ రెడ్డి నోటీఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పాలన అందిస్తామన్నప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖలు ఒకే చోట ఉన్న విధంగా గ్రామ స్థాయిలో కూడా అదే విధమైన పద్ధతి ఒకే కార్యాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామ, పట్టణ స్థాయిల్లో సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయడం ద్వారా ఒకేసారి దాదాపు లక్షా 30 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రధానమైన శాఖకు సంబంధించిన బాధ్యలు గ్రామంలోనే ప్రజలకు అందుబాటులో ఉండే విధానాన్ని అక్టోబర్‌2 నుంచి గాంధీజి 150వ జయంతి నాడు ప్రభుత్వం అమలు చేస్తోంది.

గ్రామాలకు గ్రామాలను దోచుకున్న జన్మభూమి కమిటీలు :
దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇంతకు ముందు ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా గ్రామ సచివాలయ వ్యవస్థ అన్ని కీలకమైన ప్రభుత్వ శాఖ ఉద్యోగులతోనూ ఏర్పాటవుతూ కొత్త పరిపాలన విధానానికి నాంధి పలుకుతోంది. తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలు పల్లెల్ని దోచుకుతిన్నాయి. ఒక్కో పనికి ఇంతంటూ రేటు కట్టి మరీ వసూలు చేయడం ద్వారా పాలన మొత్తం ఒక అరాచకంగా సాగింది. ప్రభుత్వ పథకాలు జన్మభూమి కమిటీల కడుపు నింపిన తరువాతే ఇతర సామాన్య జనాలకు అందేవి. దీంతో ప్రజలు విసుగెత్తిపి ఈ దోపిడీ వ్యవస్థకు చరమ గీతం పాడారు. జగన్ మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే సీఎం జగన్ విలేజ్ వాలెంటీర్ల వ్యవస్థ గురించి స్పష్టమైన ప్రకటన చేశారు. పంచాయితీల పరిధిలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ మరియు ప్రతి గ్రామ సచివాలయంలో పది మందికి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది.

జగన్‌ ఆలోచన నుంచి పుట్టిన సచివాలయ వ్యవస్థ :
పాదయాత్రలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు గ్రామ వాలంటీర్ పోస్టులకు నోటీఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు వ్యవస్థ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎంపికైనవారికి నియామక పత్రాలు అందచేశారు. గ్రామ సచివాలయా ఏర్పాటు ద్వారా గ్రామ పరిపాలనలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీంతో సీఎం వైఎస్‌జగన్‌ఆలోచన నుంచి పుట్టిన సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. మేనిఫేస్టోలోని ప్రతి హామీ అమలుకు సీఎం శ్రీకారం చుట్టారు. అక్టోబర్‌రెండో తేదీ నుంచి సచివాలయ వ్యవస్థ ప్రారంభం కానుంది. గ్రామాల్లో వాలంటీర్లు గ్రామ సచివాలయ ఉద్యోగులతో గ్రామ స్వరాజ్యం వైపు వైసీపీ సర్కార్‌అడుగు వేసింది. రికార్డు స్థాయిలో లక్షా 26 వేల 728 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన జగన్‌మోహన్‌రెడ్డి ఎంపికైన వారందరికీ అపాయింట్‌మెంట్‌ఆర్డర్స్‌జిల్లాల వారిగా అందచేశారు. ఇదో గ్రామ సెక్రటరియేట్ లా పని చేయాలని జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. నవరత్నాలతో పాటు మేనిఫేస్టోలో చెప్పిన అంశాలను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో గ్రామ సచివాలయాల పనితీరుపై తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్‌నుండే పరిశీలించనున్నారు. ప్రతి సచివాలయంలో పదకొండు నుంచి పన్నెండు మంది ఉద్యోగులు పనిచేస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 ఉద్యోగులతో కొత్త వ్యవస్థను సృష్టించడం వల్ల ప్రభుత్వ పథకాలు అర్హులకు ఇంటింటికీ చేరేలా పకడ్బంధీంగా జగన్‌ప్రభుత్వం ముందుకు వెళుతోంది. కులం, మతం, ప్రాంతం చూడం, పార్టీలకు అతీతంగా గ్రామవాలంటీర్లు పనిచేస్తారని అలాగే ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ గ్రామ సచివాలయాల ద్వారా అందచేస్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే చెబుతున్నారు. సొంత గ్రామాల్లో ఉండేవారు పక్షపాతంగా పనిచేస్తారనే ముందుచూపుతో నియామక పత్రాలు కూడా ఎంపికైనా ఉద్యోగి స్థానిక గ్రామం కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో నియమించారు. దీంతో గ్రామాల్లో వర్గ విబేధాలు లేకుండా ప్రతీ ఒక్కరికీ వైసీపీ సంక్షేమ పథకాలు చేరేలా గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పనిచేస్తారు.

అక్కసుతోనే చంద్రబాబు ఆరోపణలు :
ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఒకవైపు గ్రామ వలంటీర్లవ్యవస్థను సృష్టించి లక్షా 26వేల మందికిపైగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని టిడిపి అధినేత చంద్రబాబు ప్రతీనిమిషం తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు గ్రామ వాలంటీర్లు వెళ్లి డోర్లు కొడతారు అంటూ స్థాయిని తగ్గించుకొని వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి నోటి తీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. అయిదేళ్ల అధికారంలో నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగ కల్పన చేయకుండా చేతులెత్తేసిన చంద్రబాబు గ్రామ వలంటీర్ల వ్యక్తిత్వాలను కించపరుస్తూ మాట్లాడడం, మహిళల శీలాలను శంకించే విధంగా దూషించడం మాజీ ముఖ్యమంత్రి రాజకీయ దుస్థితికి అద్దం పడుతోంది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం లక్షా 25 వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు బృందం కారుకూతలు కూస్తున్నారు. ఒకవేళ పేపర్‌లీకేజ్‌అయితే అది పరీక్షా జరిగిన రోజే బట్టబయలు అవుతుంది. ప్రజల్లో కూడా దానిపై వ్యతిరేకత, ఆందోళను మొదలవుతాయి. ఫలితాలు వచ్చాక తన జాతి మీడియాతో చంద్రబాబు రాయించిన, కూయించిన పచ్చ పబ్లిసిటీ పనులు విజయవంతం కాలేదు. దీంతో గ్రామవాలంటీర్లు, సచివాలయ సిబ్బందిపై చంద్రబాబు అండ్‌కో భవిష్యత్తులో ఎన్ని నిందలు వేయడానికైనా వెనుకాడరు.

గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభం :
దేశంలో ఏ కొత్త విధానం/వ్యవస్థనైనా ప్రజలు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. అలాగే గ్రామ సచివాలయ, వలంటీర్ల పనితీరు ఫలితాలు రావడానికి కూడా ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ప్రజలు ఆశీర్వదించి సొంతం చేసుకుంటే గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌నుంచే ప్రారంభమై దేశ వ్యాప్తంగా అమలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -