వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో జిల్లాలో మరో సారి రాజకీయాలు వేడెక్కాయి. పులివెందులలోని ఆయన స్వగ్రుహంలో దుండుగులు అతికిరాతకంగా చంపిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో జైలు శిక్ష అనుభవించి మూడు నెల్ల కింద జైలునుంచి విడుదళయిన సుధాకర్రెడ్డికి సంబంధం ఉందనే వార్తలు రావడంతో ఆయన స్పందించారు. వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుధాకర్ రెడ్డి తెలిపారు .
హత్య జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నానని, వివేకానందరెడ్డి ఇల్లు కూడా తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించాడు. గతంలోనూ రాజారెడ్డి హత్యకేసులో తనపై నిష్కారణంగా కేసుపెట్టి అన్యాయంగా ఇరికించారని తెలిపారు. జైలునుంచి విడుదల అయిన తర్వాత 9 ఎకరాల్లో అరటిపంట వేసుకుని సాగుచేసుకుంటున్నానని పేర్కొన్నారు.ఈ విషయం తెలియగానే తాను పోలీస్ స్టేషన్కు వెళ్లానని, అక్కడ ఎస్ఐ లేకపోవడంతో కానిస్టేబుల్ను కలిసి తనకే సంబంధం లేదని చెప్పినట్టు తెలిపారు. తాను తప్పుచేసినట్టు తేలితే ఉరి తీయాలని సవాల్ విసిరారు.