Friday, March 29, 2024
- Advertisement -

తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన మేఘా

- Advertisement -

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)పై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారన్న వార్తను ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ వార్తను శనివారం ప్రచురించింది. అసలు అది ఏమాత్రం వాస్తవం కాకపోయినా దాన్ని ప్రముఖంగా ప్రచురించడం జర్నలిజం నైతికతకే దెబ్బ. వార్తలో కనీస సమాచారం లేకుండా పూర్తిగా అవాస్తవాలను, ఊహాజనిత విషయాలను ప్రచురించారు. కనీసమైన ధృవీకరణ లేకుండానే వార్తలను ప్రచురించడం కొన్ని అదృశ్య శక్తుల దురుద్దేశ్యాలను బట్టబయలు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ విధమైన ప్రచారం అధికం అయ్యింది. ముఖ్యంగా కొందరు ఉద్ధేశ్యపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో మేఘా ఇంజినీరింగ్పై ఐటీ, ఈడీ, జీఎస్టీ సంస్థలు దాడులు జరిపాయని కొన్ని సందర్భాల్లోనూ, జరగబోతున్నాయని మరికొన్ని సందర్భాల్లో కక్ష పూరితంగా వ్యాప్తి చేస్తున్నారు.

అవి మౌఖికంగా వ్యాప్తి చెందుతుండటంతో మీడియా సంస్థల ప్రతినిధులు కూడా వాటి ప్రభావానికి ఎంతో కొంత లోనవుతున్నట్టు కనిపిస్తున్నది. ఇటీవల హైదరాబాద్కు చెందిన మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీపై జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడుల విషయంలోనూ ఎలాంటి అధికారిక సమాచారం లేకుండానే అనేక వార్తలను దాని చుట్టూ అల్లి ప్రచురించాయి. ఆ నేపథ్యంలోనే జీఎస్టీ దాడులంటూ అనవసరపు హాడావిడిని సృష్టించాలన్న ప్రయత్నం ఆంగ్ల దినపత్రిక చేసింది. ఇలాంటి వార్తలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆ ఇన్ఫ్రా కంపెనీ ఆంగ్ల పత్రికపై చట్ట పరమైన చర్యలను తీసుకునేందుకు సిద్ధమైంది. ఇలాంటి ఇలాంటి గాలి వార్తలు ప్రచురించకుండా మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలే సరైన మార్గంగా కనిపిస్తోంది.

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ పన్ను సంబంధిత చట్టాలను ఎప్పుడూ అతిక్రమించదు. గత రెండు సంవత్సరాల్లో పన్ను చెల్లింపుదారుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కెళ్లా ఎక్కువ జీఎస్టీని చెల్లించిన సంస్థ మేఘానే. జీఎస్టీ వచ్చాకా ఈ కంపెనీ దాదాపు మూడు వేల కోట్ల రూపాయల చెల్లింపులను చేసింది. దేశంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న ఇన్ ఫ్రా సంస్థల్లో ఒకటిగా నిలుస్తూ ఉంది. పన్ను చట్టాలను ఎప్పుడూ ఈ సంస్థ గౌరవిస్తుంది. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి అంశాల్లో పురోగమన దశలో ఉన్న సంస్థలపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రభావం చూపిస్తాయి. ఎలాంటి నిజనిర్ధారణ లేకుండా వాళ్లు అలాంటి ప్రచారాలను చేస్తూ ఉన్నారు. మేఘాపై తప్పుడు కథనాలతో అనుచితమైన, అనవసరమైన ప్రచారానికి పాల్పడిన డెక్కన్ క్రానికల్ తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ అంశంలో ఎంఈఐఎల్ చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతోంది. మరోసారి ఇలాంటి ఊహాజనిత వార్తలను రాయకుండా నివారించడానికి అదే మార్గం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -