భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనె అనుమానంతో భర్త దారుణానికి ఒడిగట్టారు. భార్య ప్రియుడ్ని కరెంట్ షాక్ తో హతమార్చాలని భర్త చేసిన పనికి ముగ్గురు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారున ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెల్తే… భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే వ్యక్తి (46) కుటుంబంతో కలిసి దక్షిణ 24 పరగణాల జిల్లాలో నివాసముంటున్నాడు. అతని బంధువులు కూడా అక్కడే ఉంటున్నారు. గత కొంతకాలంగా తన భార్య దగ్గరి బంధువైన మరో వ్యక్తితో సంబంధ పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. ఇటీవల వారిద్దరూ కలిసి బయటకు వెళ్లడంతో ఈ అనుమానం అతనికి మరింత బలపడింది. దీంతో భార్య ప్రియుడిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు.
ఇంటి గుమ్మం బయట విద్యుత్ ప్రసారమయ్యే తీగను తెంచి పడేశాడు. ఇంట్లో ఉన్న అతన్ని బయటకు తెప్పించేందుకు బట్టలను తగులబెట్టాడు. మంటల్ని ఆర్పేందుకు ఇంట్లో వారు ఒకరివెనుక ఒకరు రావడంతో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.