మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనేదానిపై దృష్టిసారించారు. జిల్లాల వారీగా సామాజిక సమీకరణలు, సీనియారిటీ, ఇతర అంశాలను బేరీజు వేస్తున్నారు .ఓవైపు పాలనపై పట్టు సాధించేందుకు వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూనే.. మరోవైపు కేబినెట్పై కసరత్తు చేస్తున్నారు. తన కేబినెట్లో ఏ ఎమ్మెల్యేలకు చోటు కల్పించాలి..? ఎవరికి ఏ శాఖ అయితే బాగుంటుంది? ఏ శాఖను ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తారు? అనే అంశాలను బేరీజు వేసుకుంటూ ఓ నిర్ణయానికి వస్తున్నట్లు సమాచారం.
ఈ నెల 8వ తేదీన కేబినెట్ విస్తరణ ఉండగా.. ఫుల్ బెంచ్ కేబినెట్ ఏర్పాటు చేస్తారా? లేక 10 మందితోనే కేబినెట్ విస్తరిస్తారా? అనే చర్చ సాగుతోంది. పార్లమెంట్ నియోజకవర్గానికో మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.ఇక జిల్లాల వారీగా ఏపీ కేబినెట్ రేసులో ఉన్న నేతల పేర్లను ఓ సారి పరిశీలిస్తే..
- శ్రీకాకుళం: ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం
- విజయనగరం: బొత్స, కొలగట్ల, పుష్ప శ్రీవాణి
- విశాఖ: గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాస్, బూడి ముత్యాల నాయుడు, కరణం ధర్మ శ్రీ, గొల్ల బాబురావు
- తూర్పు గోదావరి: పిల్లి సుభాష్ చంద్రబోస్, చెల్లుబోయిన వేణు, విశ్వరూప్, కన్నబాబు, జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా
- పశ్చిమ గోదావరి: ప్రసాద రాజు, రంగనాథరాజు, బాలరాజు, ఆళ్ల నాని, గ్రంధి శ్రీనివాస్
- కృష్ణా జిల్లా: కొడాలి నాని, పార్ధసారథి, పేర్ని నాని, సామినేని ఉదయ భాను
- గుంటూరు: ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, పిన్నెల్లి, సుచరిత
- ప్రకాశం జిల్లా: బాలినేని, ఆదిమూలపు సురేష్
- నెల్లూరు: ఆనం రాంనారాయణరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటు గౌతమ్ రెడ్డి, వర ప్రసాద్
- చిత్తూరు: పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, రోజా, చెవిరెడ్డి, కరణాకర్ రెడ్డి
- కడప: అంజాద్ పాషా, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు
- అనంతపురం: వెంకట్రామిరెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి
- కర్నూలు: బుగ్గన, బాలనాగిరెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి
ఇక కేబినెట్పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్కును చూపుతారా..? కొత్త పంథాలో కేబినెట్ విస్తరణ చేపడతారా..? సామాజిక సమీకరణాలు, సీనియార్టీ, విధేయతకు పెద్ద పీట వేస్తారా? అనే అంచనాలు కూడా వేస్తున్నారు విశ్లేషకులు.