ఇన్ని రోజులూ మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన ఘటనలనే మనం చూశాం. కానీ, ఇప్పుడు ఐదుగురు వ్యక్తులు కలిసి 26 ఏళ్ల యువకుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో జరిగింది. తన భార్యతో అక్మమ సంబంధం పెట్టుకున్నాడనె కోపంతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో అక్మమ సంబంధం పెట్టుకున్నాడనె కోపంతో ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఓ యువకుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా పరిధిలోని సూళ్లూరుపేటలో జరిగింది. అత్యాచార ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించి చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆయువకుడు ధైర్యం చేసి పోలీసులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
నిందితుల్లో ఒకరి భార్యతో బాధితుడికి వివాహేతర సంబంధం ఉందని, దీనికి ప్రతీకారంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెసిలింది. ఉచ్చూరుకి చెందిన 26 ఏళ్ల యువకుడు ఓ షోరూమ్ వద్ద నిలబడివుండగా, నాగరాజపురానికి చెందిన దయాకర్, బాలచెన్నయ్య, వెంకట్వేర్లు, ఎం మహేష్, మస్తాన్ అనే యువకులు అక్కడికి వచ్చి, మాటల్లో పెట్టి, ఆటోలో కిడ్నాప్ చేశారు. ఆపై శివార్లకు తీసుకెళ్లి, కర్రలతో కొట్టారు. అతనిపై అత్యాచారం చేస్తూ, సెల్ ఫోన్ లో వీడియో తీశారు. అనంతరం అతన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కాసేపటికి తేరుకున్న బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.