Friday, April 19, 2024
- Advertisement -

తిరుమ‌ల‌లో ఎదురైన సంఘ‌ట‌న‌తో షాక్ తిన్న జ‌గ‌న్‌

- Advertisement -

జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి ముందు తిరుమ‌ళ వెల్లి వెంట‌కేశ్వ‌రుని స్వామిని ద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌న అనంత‌రం కడపకు వెళ్లాల్సి ఉండటంతో… తన కాన్వాయ్‌లో బయలుదేరారు. అయితే దారి మ‌ధ్య‌లో అనుకోని సంఘ‌ట‌న ఎదుర‌య్యింది. విమానాశ్రయానికి వెళుతున్న జగన్‌‌ కాన్వాయ్‌కు ఓ మహిళ అడ్డుపడింది. పద్మావతి అతిథిగృహం వద్ద ఆమె కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లింది. అంతే ఒక్క క్షణంలో అంతా షాకయ్యారు. ఆమె ఎవరు, ఎందుకు అడ్డువచ్చింది, అసలు కాన్వాయ్‌ దాకా ఆమె ఎలా వచ్చింది ఇలా ఎన్నో డౌట్లు క్షణాల్లో అందరి మైండ్లలో తిరిగాయి

భ‌ద్ర‌తా సిబ్బంది గ‌మ‌నించి ఆ మ‌హిళ‌ను ప‌క్క‌కు లాగే ప్ర‌య‌త్నం చేయ‌గా ఆమెకు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌ను గ‌మ‌నించిన జ‌గ‌న్ ఆమెను ఏమీ అనవద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆమెను ద‌గ్గ‌ర‌కు పిల్చుకొని ఆమె సమస్యను అడిగి తెలుసుకుని.. సర్ధి చెప్పి అక్కడి నుంచి పంపారు.

కాన్వాయ్‌ ఆపి… ఆమె దగ్గరకు వచ్చిన జగన్ ఏంటమ్మా అని అడిగారు. ఆమె అమలాపురానికి చెందిన దాన్నని జగన్‌కు వివరించింది. తన భర్తకు ఉద్యోగం కావాలని కన్నీరు పెట్టింది. తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తానన్న జగన్, ఆందోళన చెందవద్దని ఆమెకు భరోసా ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -