తెలంగాణా సీఎం కేసీఆర్ కు నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘస్వాగతం పలికారు. కేసీఆర్ కుటుంబ సమేతంగా కంచి(తమిళనాడు), తిరుమల పర్యటనకు ఇవాళ ఉదయం బయల్దేరి వెళ్లారు. సోమవారం ఉదయం కుటుంబసభ్యలతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు.
రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన కంచికి పయనం అయ్యారు కేసీఆర్. రోడ్డు మార్గంలో వెళ్తున్న సీఎం కేసీఆర్ నగరికి చేరుకోగానే అపూర్వ స్వాగతం లభించింది. నగరి చేరుకున్న సీఎం కేసీఆర్కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఘనస్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ కంచికి బయల్దేరారు.
నగరి నుంచి నేరుగా కంచి చేరుకున్న చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అత్తివరద రాజస్వామి దేవాయంతో పాటు కామాక్షి దేవాలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో తిరుమళ వెంటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.