- Advertisement -
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ మరొకరు ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. కర్నూలు జిల్లా నంద్యాల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న అనిల్ కుమార్ ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ ఈరోజు కోర్టు ఆవరణలోనే పురుగుల మందు తాగాడు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదాన్ని నుదుటిపై రాసుకున్న అనిల్.. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు, తోటి లాయర్లు ఆయన్ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.