సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడుతూనె మరో వైపు చంద్రబాబు హాయంలో జరిగిన అవినీతిపై దృష్టి సారించారు. ఒక్కొక్క శాఖలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు ఉన్నత స్థాయి కమిటీలను వేస్తున్నారు. ఇప్పటికే పోలవరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిటీలు వేసిన జగన్ తాజాగా మరో అస్త్రాన్ని సంధించారు. చంద్రబాబు హయాంలో ఉన్నత విద్యామండలిలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించారు.
తాజాగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కూడా చంద్రబాబుకి చెమటలు పట్టిస్తుంది అందంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉన్నత విద్యామండలి అధికారుల పై నిధుల గోల్ మాల్ ఆరోపణలు వచ్చాయి. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వచ్చే నెలాఖరుకల్లా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి విచారణకు ఆదేశించారు. అలాగే, టీడీపీ హయాంలో ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులకు సంబంధించి కూడా విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో బాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.