Friday, March 29, 2024
- Advertisement -

ముఖ్య‌నేత‌ల‌తో అమ‌రావ‌తి బయ‌లుదేరిన జ‌గ‌న్‌..

- Advertisement -

గురువారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఎన్నిక‌ల కౌంటింగ్ ప్ర‌క్రియ మొద‌లు కానుండ‌టంతో అన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కులు అమ‌రావ‌తి చేరుకుంటున్నారు. రేపు వెలువ‌డే ఫ‌లితాల‌పై అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు.ఇక రాజ‌కీయా పార్టీల నేత‌ల‌కు నిద్ర‌ప‌ట్ట‌డంలేదు.ఫ‌లితాలు ఎలా ఉంటాయోన‌నె ఆందోళ‌న నెల‌కొంది.

ఎన్నిక‌ల ఫ‌లితాల స‌ర‌ళిని స‌మీక్షించేందుకు అమరావతిలోని పార్టీ కార్యాలయాల్లో నేతలతో కలిసి వీక్షించేందుకు అన్ని పార్టీల అధినేతలు రెడీ అయ్యారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం అమరావతి చేరుకున్నారు. రెండురోజులుగా ఆయన అమరావతిలోనే ఉంటున్నారు. గురువారం పార్టీ కార్యాలయంలోనే పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ఫలితాలను వీక్షించనున్నారు. ఇక చంద్ర‌బాబు కూడా కుప్పంనుంచి ఉండ‌వ‌ల్లి చేరుఉన్నారు.

వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం నుంచి జగన్ హెలికాప్టర్ లో బెజవాడ పయనం అయ్యారు. ఆయన వెంట హెలికాప్టర్ లో పార్టీ ముఖ్యనేతలు కూడా ఉన్నారు. గురువారం ఓట్ల లెక్కింపు సందర్భంగా విజయవాడలోని వైసీపీ కార్యాలయం నుంచి జగన్ ఎన్నికల ఫలితాల తీరుతెన్నులను పరిశీలించనున్నారు. ఉద‌యం 8 గంట‌ల‌కు ఎన్నిక‌ల కౌంటింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ఫ‌లితాల నేప‌ధ్యంలో బాబు, జ‌గ‌న్ నివాసాలా వ‌ద్ద క‌ట్టుదిట్ట‌మైన బ‌ధ్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -