కథువా, ఉన్నావ్లో చోటుచేసుకున్న ఘోరాలపై వైసీపీ అధినేత వైస్ జగన్మమోహన్ రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. ఆడబిడ్డలను కాపాడుకోవడంలో ఒక దేశంగా మనం విఫలం చెందామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వాన్ని మంటగలిపే ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టమన్నారు.
మున్ముందు ఇలాంటి నేరాలు చేయాలన్న తలంపు కూడా ఏ ఒక్కరికీ రాని విధంగా నిందితులను కఠిన శిక్షించాలని అభిప్రాయపడ్డారు. సోమవారం ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేసిన ఆయన.. ఆంధ్రప్రదేశ్లోనూ మహిళలకు భద్రత కరువైన విషయాన్ని గుర్తుచేశారు.
‘‘మానవత్వం మంటగలిసిందనడానికి కథువా, ఉన్నావ్ ఘటనలకన్నా వేరే సాక్ష్యాలు అక్కర్లేదు. ఆడపిల్లల్ని కాపాడుకోవడంలో ఒక దేశంగా మనం వైఫల్యం చెందాం. బాధకరమైన విషయమేమిటంటే ఆంధ్రప్రదేశ్లోనూ పరిస్థితి అంతకు తీసిపోలేదు. గతేడాది అక్టోబర్ 17న వైజాగ్ రైల్వే కాలనీలో ఓ మహిళపై పట్టపగలే లైంగికదాడి జరిగింది. డిసెంబర్లో పెందుర్తిలో మరో దళిత మహిళను వివస్త్రను చేసి దాడిచేశారు. ఈ సారి నిందితులను అస్సలు విడిచిపెట్టొద్దు. ఏఒక్కరు కూడా ఇలాంటి నేరానికి పాల్పడాలన్న ఆలోచన రాకుండా భయం పుట్టేలా కఠిన శిక్షలు విధించాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
The heinous incidents in #Kathua and #Unnao are as much a testimony to the depravity of humanity as they are to the state of law and order in our country. We as a nation have failed our daughters. And AP sadly, has done no better.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2018