Wednesday, April 24, 2024
- Advertisement -

జగన్ అనే నేను @ మే 30న ఉ.10: 45లకు ముహుర్తం…

- Advertisement -

యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను……..యావత్తు తెలుగు జాతి గర్వించే విధంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తలెత్తుకునే విధంగా మా నాయకుడు 30 సంవత్సరాలకు పైగా పాలిస్తాడు అని చెప్పుకునే వైస్సార్ అభిమానులులకు ఎంతో అసలుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది…

ఏపీలో ఫ్యాన్ టాప్ స్పీడుకు సైకిల్‌తోపాటు ఇత‌ర పార్టీల అడ్ర‌స్ గ‌ల్లంత‌య్యింది. వైసీపీ అభ్య‌ర్ధులు తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ నెల 25న (శనివారం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శానససభా పక్ష సమావేశం జరగనుంద‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

ఎన్నికల ఫలితాలను పరిశీలించిన తర్వాత శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని జగన్ చిన్నాన్న, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా స్పష్టం చేశారు. ఈనెల 25న జ‌రిగే శాస‌న‌స‌భా ప‌క్ష‌స‌మావేశంలో శాసనసభా పక్ష నాయకుడిని ఎమ్మెల్యేలందరూ కలిసి ఎన్నుకోనున్నారు. ఈ స‌మావేశం తాడేపల్లిలోని జగన్ నివాసంలో కానీ.. పార్టీ ఆఫీసులో నిర్వహించే అవకాశం ఉన్నట్లు స‌మాచారం.

మరోవైపు జగన్ ఈ నెల 30 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ‌నున్నారు. మే 30న ఏకాదశి కూడా కావడంతో మంచిరోజుని భావించి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ జాతక ప్రకారం కూడా ఆ రోజు బావుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ముహుర్తంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీతో కూడా జగన్ ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -