- Advertisement -
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సతీష్ రెడ్డి పై 90,543ఓట్ల మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. 30 రౌండ్లలో కొనసాగిన ఓట్ల లెక్కింపులో తొలి నుంచి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చిన జగన్ విజయ దుందుభి మోగించారు.
వైఎస్ జగన్ 2014లో పులివెందుల నుంచి 74,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన 90,543 ఆధిక్యంతో గెలుపొందడంతో తన మెజార్టీ రికార్డు మరింత మెరుగుపరుచుకున్నారు. జగన్ గెలుపుపై పార్టీ నేతలు సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ కు అభినందనలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు.