Thursday, March 28, 2024
- Advertisement -

కమిష‌న‌ర్‌ అంజ‌నీ కుమార్‌ను క‌ల‌సిన వైఎస్ ష‌ర్మిల‌..

- Advertisement -

సోషల్‌మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర​ వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ ష‌ర్మిల‌ హైద‌రాబాద్ సీపీ అంజనీ కుమార్‌ను క‌ల‌సి ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం షర్మిళ, భర్త అనిల్‌ కుమార్‌తో కలిసి కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లారు.

సామాజి మాధ్యమాల్లో తనపై అసభహ్యకర వ్యాఖ్యలు ప్రచారం చేస్తువారిపై చర్యలు తీసుకోవాలని కమీషనర్ కు ఫిర్యాదు చేసినట్లు షర్మిల తెలిపారరు. సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తల పేరుతో వస్తున్న పోస్టింగులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల క్రితం పోలీసుల చర్యలతో ఈ వార్తలు ఆగినా ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా మళ్లీ ప్రచారం మొదలయ్యిందని ఆమె పేర్కొన్నారు.

ఇది నా ఒక్కదానికే జరిగిన అవమానంగా నేను భావించడం లేదు. ఇలాంటి రాతలు, ఇంకెంతో మంది మహిళల మీద కూడా రాస్తున్నారు. స్త్రీల పట్ల ఇంత శాడిజం, ఇంత చులకన భావంతో రాస్తున్న రాతలను, దుష్ర్పచారాన్ని మనం సమాజం ఆమోదించవచ్చా? ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సమానత్వం, ఉమెన్స్ లిబరేషన్ లాంటి ఎన్నో గొప్ప గొప్ప పదాలు కాగితాలకు, చర్చలకు మాత్రమే పరిమితం కాకూడద‌న్నారు.

నాకు, ప్రభాస్ అనే ఒక మూవీ స్టార్ కు సంబంధం ఉంది… అనే దుష్ర్పచారాన్ని ఆన్ లైన్ లో ఒక క్యాంపెయిన్ లాగా, నడిపింది ఒక వర్గం. అప్పట్లో 2014 ఎన్నికల తరువాత, మేను ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. విచారణ చేసి, పోలీస్ యాక్షన్ తరువాత, కొంతకాలం ఈ దుష్ప్రచారం ఆగిన సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -