వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇప్పుడు రాష్ట్రరాజకీయాలను కుదిపేస్తోంది. హత్య రాజకీయ రంగు పులముకుంది. దీని వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. పోస్ట్ మార్టంలో హత్యేనని తేలడంతో సిట్ దర్యాప్తు చేస్తోంది. అయితే తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. రాజారెడ్డి హత్యకేసుతో దీనికి సంబంధం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
సరిగ్గా ఎన్నికలు ముందే వైఎస్ రాజారెడ్డి హత్యకు గురయ్యారు. ఇప్పుడు అదేరీతిలో ఎన్నికలు నెలరోజు ముందు వివేకానందరెడ్డి హత్యకు గురికావడం సంలచనం కలిగిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డిది తొలుత గుండెపోటుతో మరణించినట్టుగా భావించారు. కానీ, శరీరంపై గాయాలు ఉండడంతో అతడిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
వివేకానందరెడ్డి హత్య తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్యతో లింకు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కోణంలోనే వివేకా కుటుంభ సభ్యులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజారెడ్డి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుధాకర్ రెడ్డి మూడు నెలల క్రితమే సత్పవర్తన కింద జైలు నుంచి విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. అతనిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.