Friday, March 29, 2024
- Advertisement -

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మ‌రో ట్విస్ట్‌…

- Advertisement -

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగింది. సీబీఐచేత గాని లేదా ధ‌ర్డ్ పార్టీ చేత‌గాని విచార‌ణ జ‌ర‌పించాల‌ని ఆయ‌న భార్య సౌభాగ్య‌మ్మ ఏపీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇప్ప‌టికే ఈ హ‌త్య రాజ‌కీయ రంగు పులుముకున్న సంగ‌తి తెలిసిందే. వైసీపీ, టీడీపీలో ఒక‌రిమీద ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.

ఇప్ప‌టికే ఈ హ‌త్య పై ఏపీ ప్ర‌భుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. కేసును సిట్ ముమ్మ‌రంగా ద‌ర్యాప్తు చేస్తోంది. సిట్‌పై న‌మ్మ‌కం లేద‌ని వైఎస్ కుంటుంభ స‌భ్యులు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. వివేకానంద‌రెడ్డి కూతురు సునీత ఇప్ప‌టికే కేంద్ర‌హోంశాఖ కార్య‌ద‌ర్శిని క‌ల‌సిన సంగ‌తి తెలిసిందే. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -