- Advertisement -
ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య రాష్ట్రరంలో సంచలనం రేపుతోంది. ఈ హత్యపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ చేస్తోంది. సిట్పై తమకు దర్యాప్తు లేదని సీబీఐ చేత విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఇదలా ఉంటె వివేకా కుమార్తె ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాను కలిశారు. న తండ్రి మరణంపై జరుగుతున్న విచారణను సీఈసీ పర్యవేక్షించాలని ఆమె కోరారు. వివేకా హత్యపై రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని సంస్థతో దర్యాప్తు చేయించాలని రిక్వెస్ట్ చేశారు. మరోవైపు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కూడా సునీత తన భర్తతో కలసి నిన్న కలిసిన సంగతి తెలిసిందే.