Tuesday, April 16, 2024
- Advertisement -

వైసీపీ అభ్య‌ర్తుల జాబితా ప్ర‌క‌ట‌న వాయిదా….ఎప్పుడంటే…?

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌నున్న పార్టీ అభ్య‌ర్తుల జాబితా వాయిదా ప‌డింది. సాయంత్రం అభ్య‌ర్తుల జాబితా ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికి వైఎస్ వివేకా హ‌త్య‌కు గుర‌వ‌డంతో జాబితా ప్ర‌క‌ట‌నను రేప‌టికి వాయిదా వేశారు. ఆదివారం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని దర్శించుకున్న తర్వాత జగన్ జాబితాను విడుదల చేయనున్నారు.తొలి జాబితాలో 150కి పైగా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. అలాగే 25 లోక్‌సభ స్థానాలకు గాను 22మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వ‌ర్గాల‌నుంచి స‌మాచారం. ఇడుపులపాయలో అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించిన త‌ర్వాత విశాఖకు జగన్ వెళతారని సమాచారం. నెల్లిమర్ల, పి.నర్సీపట్నం, పి.గన్నవరంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని సమచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -