Friday, March 29, 2024
- Advertisement -

జగన్ ప్రభుత్వం.. చంద్రబాబు సైకిళ్లు…

- Advertisement -

కొత్త ప్రభుత్వం వచ్చింది. రెండు నెలలు గడిచిపోయాయి. అయినా మన అధికారుల మత్తు వదలడం లేదు. ఇంకా చంద్రబాబే సీఎం అని అనుకుంటున్నట్టున్నారు. అందుకే జగన్ కొలువుదీరినా ఇంకా బాబు హయాంలో కొన్న సైకిళ్లను ఆయన ఫొటోతోనే పంచడం వివాదాస్పదమైంది.

చంద్రబాబు సొంత జిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో బాబు పేరిట సైకిళ్లు పంచడం కలకలం రేపుతోంది. కొందరు అధికారులు చేసిన పని ఇప్పుడు వివాదాస్పదమైంది.

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఎత్తున సైకిళ్లను కొనుగోలు చేసింది. ఇక చంద్రబాబు కూడా గతంలో పంపిణీ కోసం కొనుగోలు చేసిన సైకిళ్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అయితే వాటిపై నాటి సీఎం చంద్రబాబు,మంత్రి గంటా ఫొటోలు ముంద్రించి ఉన్నాయి.

అయితే ప్రభుత్వం మారడంతో బాబు ఫొటో తీసి జగన్ ఫొటో పెట్టి పంచాల్సి ఉండేది. కానీ తాజాగా చిత్తూరు జిల్లా పీలేరులో అధికారులు జగన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు బొమ్మలున్న సైకిళ్లను పంపిణీ చేశారు. ఇది చూసి వైసీపీ శ్రేణులు అవాక్కయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -