ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా 135 స్థానాల్లో దూసుకుపోతోంది.వైసీపీ గెలుపు పక్కన పెడితే ఇప్పుడు అందరి చూపు మంగళగి నియోజక వర్గంమీదనె అందరి చూపు పడింది. ఎందుకంటె అక్కడ సీఎం చంద్రబాబు కొడుకు మంత్రి లోకేష్ వెనుకంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది.
మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి, ఏపీ మంత్రి నారా లోకేశ్ పై 600 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలోని 17 స్థానాల్లో వైసీపీ 9 చోట్ల, టీడీపీ 2 చోట్ల లీడింగ్ లో ఉన్నాయి. ఇప్పటివరకూ అందించిన సమాచారం ప్రకారం వైసీపీ 107, టీడీపీ 26, జనసేన 2 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. అలాగే లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు గానూ వైసీపీ 14 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుండగా, టీడీపీ ఐదు స్థానాల్లో దూసుకుపోతోంది. జనసేన, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటివరకూ పోటీలో లేవు